త్రివిక్రమ్ అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకోక పోవచ్చు అంటున్న మహేష్ ఫ్యాన్స్
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మరియు సర్కారు వారి పాట సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఆ రెండు సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యం లో తదుపరి సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను రెడీ చేసి సినిమా కు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఎస్ ఎస్ ఎం బీ 28 సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో సినిమా లో వేణు తొట్టెంపూడి ని కీలక పాత్రకు గాను త్రివిక్రమ్ ఎంపిక చేయడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ సినిమా లో రెండవ హీరోయిన్.ఒక సీనియర్ హీరోయిన్ మరియు సీనియర్ హీరో నటించడం అనేది కామన్ గా వస్తుంది.
మహేష్ బాబు సినిమా లో కూడా త్రివిక్రమ్ అదే వ్యూహం తో ముందుకు వెళ్తాడు అంటూ అంతా అనుకున్నారు.
అందులో భాగంగానే వేణు ను ఈ సినిమా కు గాను ఎంపిక చేశాడు అంటున్నారు.
ఆయన స్వయంవరంతో మంచి నటుడిగా నిరూపించుకుని పలు సినిమా లు చేశాడు.కొంత గ్యాప్ తర్వాత రామా రావు ఆన్ డ్యూటీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమా నిరాశ పర్చింది.అంతే కాకుండా ఆయన పాత్ర కు కూడా విమర్శలు వచ్చాయి.
ఆయన డబ్బింగ్ కూడా విమర్శలు ఎదుర్కొంది.ఇంతగా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిన వేణు తొట్టెంపూడిని ఈ సినిమా కు ఎలా తీసుకుంటారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయినా మహేష్ బాబు సెలక్షన్ తప్పకుండా బాగుంటుంది.ఆయన ప్రతి పాత్ర విషయం లో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటాడు.
కనుక ఈ విషయంలో ఆయన అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకోడు అంటూ మహేష్ బాబు అభిమానులు కొందరు నమ్మకంతో ఉన్నారు.
అసలు విషయం ఏంటీ అనేది సినిమా ప్రారంభం అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
స్కూల్కు లేటుగా వచ్చిందని టీచర్ను చావబాదిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్..