రిలీజ్‌కు రెడీ అయిన త్రిష మూవీ.. ఎక్కడో తెలుసా?

అందాల భామ త్రిష ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుండి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో తన నెక్ట్స్ చిత్రాన్ని మాస్ రాజా రవితేజతో చేసేందుకు త్రిష రెడీ అవుతోంది.

అయితే ఉన్నట్లుండి త్రిష సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్ కానుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్య ప్రొడ్యూస్ చేస్తూ ఆయన భార్య జ్యోతిక నటిస్తున్న పొన్‌మంగల్ వందన్ అనే సినిమాను మరికొద్ది రోజుల్లో ఓటీటీపై రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా ఇప్పుడు త్రిష నటిస్తున్న తాజా చిత్రం ‘పరంపధం విలయట్టు’ కూడా ఓటీటీపై రిలీజ్ కానున్నట్లు తెలుస్తోది.

లాక్‌డౌన్ కారణంగా ఇప్పట్లో థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావని భావించిన చిత్ర యూనిట్, ఓటీటీ అందించే భారీ మొత్తానికి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

కాగా జ్యోతిక చిత్రాన్ని ఓటీటీపై రిలీజ్ చేస్తే సూర్య కుటుంబానికి చెందని అందరి సినిమాలను బ్యాన్ చేస్తామని థియేటర్ యాజమాన్యాలు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాయి.

మరి ఇప్పుడు త్రిష తన సినిమాను నేరుగా ఓటీటీపై రిలీజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

కల్కి ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాక్.. ఓటీటీ విషయంలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారుగా!