తెలంగాణలో ఐపిఎస్ అధికారుల బదిలీలు…!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో పలువురు ఐపిఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

రాచకొండ సిపిగా సుధీర్‌ బాబు, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం సైబరాబాద్,రాచకొండ సిపిలుగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర,దేవేంద్రసింగ్ చౌహాన్‌లను డిజిపికి రిపోర్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

లడ్డు వివాదం : నేడు తిరుపతికి సిట్ బృందం