రాజస్థాన్‎లో పట్టాలు తప్పిన ట్రైన్.. పలువురికి గాయాలు

రాజస్థాన్‎లో ట్రైన్ పట్టాలు తప్పింది.పాలి సమీపంలో సూర్యనగరి ఎక్స్‎ప్రెస్‎లోని ఎనిమిది కోచ్‎లు పట్టాలు తప్పాయి.

ఈ ప్రమాదంలో సుమారు పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ముంబై నుంచి సూర్యనగరి ఎక్స్‎ప్రెస్ జోధ్‎పూర్‎కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

స్పేస్ నుంచి సన్‌సెట్‌ని ఎప్పుడైనా చూశారా.. వీడియో వైరల్..