షణ్ముఖ్ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న షన్ను!

ప్రముఖ యూట్యూర్ గా ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ అదే పాపులర్ తో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమం ద్వారా షణ్ముఖ్ మరింత పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా కాస్త నేగిటివిటీ కూడా మూటకట్టుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో సిరితో షణ్ముఖ్ ఎంతో చనువుగా ఉండటం వల్ల ఎంతో మంది నెటిజన్లు వీరి వ్యవహారశైలిపై పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ కార్యక్రమం నుంచి బయటకు రాగానే ఈయనతో దీప్తి సునైనా బ్రేకప్ చెప్పుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తన పనులలో ఎంతో బిజీ అయ్యారు.

తాజాగా షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.షణ్ముఖ్ బామ్మ తుది శ్వాస విడిచినట్లు షణ్ముఖ్ జస్వంత్ ఈ విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీ ద్వారా పోస్ట్ చేశారు.

"""/"/ ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సంతాపం ప్రకటిస్తున్నారు.

ఇక ఇన్స్టా స్టోరీ ద్వారా షణ్ముఖ్ చేసిన పోస్ట్ చూస్తుంటే తన బామ్మతో తనకు ఎంత మంచి రిలేషన్ ఉందో అర్థమవుతుంది.

ఇప్పటికే దీప్తి సునయన తనకు బ్రేకప్ చెప్పిందన్న డిప్రెషన్ లో ఉన్నటువంటి షన్నుకు తన బామ్మ మరణం మరింత కృంగదీసిందని చెప్పాలి.

మందారం తో మెరిసే చర్మం మీ సొంతం అవ్వాలంటే ఇలా చేయండి!