మెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి నలుగురు మృతి

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నలుగురు మృత్యువాత పడ్డారు.

మనోహరాబాద్ మండలం రంగయ్యపనిలో ఈ విషాద ఘటన జరిగింది.వెంటనే గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు.మరొకరి మృతదేహాం కోసం చెరువులో విస్తృతంగా గాలిస్తున్నారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!!