కర్నూలు జిల్లాలో విషాదం.. ముగ్గురు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడితో పాటు ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు.

ఎమ్మిగనూరు మండలం సిరాళ్లాదొడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది.బట్టలు ఉతకడానికి వెళ్లి ఐదేళ్ల బాలుడు ముందుగా చెరువులో పడిపోయాడు.

చిన్నారిని రక్షించే క్రమంలో సలోని, మరియమ్మ అనే మహిళలు చెరువులో పడిపోయారు.ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.

దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

9 నెలల పసిగుడ్డును బలిగొన్న కూల్ డ్రింక్ మూత.. ఆదిలాబాద్‌లో విషాదం..