వీడియో వైరల్: అయ్యబాబోయ్.. చివరకు మౌంట్ ఎవరెస్ట్ పై కూడా ‘ట్రాఫిక్ జాం’ అయ్యిందిగా..
TeluguStop.com
సముద్రమట్టం నుండి వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా మౌంట్ ఎవరెస్ట్ ( Mount Everest )పేరుగాంచింది.
ఎటు చూసినా దట్టంగా పడే మంచు, అలాగే ఎముకలు కొరికే చలిలో, అతి శీతల గాలులు వీస్తుండగా.
ఊపిరి పీల్చుకునేందుకు కూడా తగినంత ఆక్సిజన్ లేని ప్రాంతంలో అనేకమంది ఆ పర్వత శిఖరంను చేరుకునేందుకు పర్వతారోహులు తెగ కష్టపడిపోతుంటారు.
ఎన్ని సవాళ్లు ఎవరైనా సరే అనుకూల వాతావరణం లభించడంతో ఎవరెస్టును అదిరించేందుకు చాలామంది పోటెత్తుతున్నారు.
దీంతో ఎవరెస్టుపై ట్రాఫిక్ జామ్( Traffic Jam ) ఏర్పడిందని చెప్పవచ్చు.తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
ఓ వ్యక్తి పర్వతారోహణ ముగించుకొని వెను తిరుగుతున్న సమయంలో సుమారు 500 మంది పర్వతారహులు తనకి ఎదురుగా రావడం ఆ వీడియోలో చూడవచ్చు.
ఇలాంటి కష్టమైన ఎవరెస్టు ను అధిరోహించడమంటే అంత ఆషామాషీ విషయం కాదు.అది ఎంతో కష్టతరమైన విషయం అని.
పేర్కొంటూ ఓ వీడియోని సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఆ వీడియోలో దాదాపు కిలోమీటర్ మేర ప్రజలు ఒక్కరి వెనుక ఒకరు పర్వతారోహణ చేసేందుకు పోటీ పడుతున్నారు.
1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ లో ఇప్పటివరకు 7000 మంది మాత్రమే శిఖరం పైకి చేరుకొని రికార్డును సృష్టించారు.
వైరల్ గా మారిన వీడియోలో పర్వతారోహణ సమయంలో అంతమంది ఉన్నారని., ఒకే తాడును పట్టుకొని పర్వతారోహణ చేయడం మన కనపడుతుంది.
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. """/" /
ఈ మధ్య పర్వతారోహణ స్వార్థపూరితమైపోయిందని కొందరంటుండగా.
, మరికొందరైతే సాయం కోసం అర్ధిస్తున్న.ప్రాణాల పోతున్న ఎవరు పట్టించుకోరని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే కొందరు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే సమయంలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఈ హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను వాడితే స్పాట్ లెస్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం!