గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ..!
TeluguStop.com
హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది.ఇందులో ప్రధానంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారంపై చర్చ కొనసాగుతుందని సమాచారం.
ఎంపీ కోమటిరెడ్డిపై పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ తో పాటు అనిల్, అద్దంకి దయాకర్ పట్టుబడుతున్నారు.
మరోవైపు ఎంపీ కోమటిరెడ్డిపై చర్యలు తమ పరిధిలోకి వస్తాయా? లేక ఏఐసీసీ పరిధిలోకి వస్తాయా అన్న అంశంపై నేతలు చర్చిస్తున్నారు.
చిరంజీవి కంటే స్టార్ హీరో విజయ్ బెస్ట్ అంటున్న కీర్తి సురేష్.. మీకేం తెలుసంటూ?