111 జీవో రద్దుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం

జీవో 111 రద్దుపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవోను రద్దు చేశారని విమర్శించారు.కేసీఆర్ తో పాటు ఆయన బినామీల చేతులలో వేల ఎకరాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ జీవో రద్దుతో జంట నగరాలపై అణుబాంబు వేసినట్టేనని తెలిపారు.పీజేఆర్ పోరాటంతోనే కృష్ణా జలాలు హైదరాబాద్ కు వచ్చాయన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో గోదావరి జలాలు వచ్చాయని స్పష్టం చేశారు.

గత పదేళ్లలో ఏకంగా 7 హిట్లు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే సాధ్యమైందిగా!