పోలీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

ఎంపీగా సెక్రటేరియట్ కు వెళ్తే పోలీసులకు అభ్యంతరం ఏంటని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తీవ్రవాదిని అడ్డుకున్నట్లు తనను అడ్డుకున్నారన్నారు.సచివాలయానికి వెళ్లడానికి ఎంపీగా తనకు హక్కు లేదా అని ప్రశ్నించారు.

కేటీఆర్ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని తెలిపారు.ఓఆర్ఆర్ ప్రజల ఆస్తి.

అమ్ముతామంటే ఊరుకునేది లేదని చెప్పారు.ఈ దోపిడీ వెనకాల కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని తెలిపారు.

అవినీతిపై ఈడీ, ఐటీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

వైరల్ వీడియో: విదేశీయులను డబ్బులు డిమాండ్ చేసిన భిక్షాటన చిన్నారులు..