తీగల వంతెనపై కారు నడిపిన టూరిస్టులు.. పిచ్చి పట్టిందా అని ఏకపారేస్తున్న నెటిజన్లు..

గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతుల కూలిపోయి వందల కొద్దీ మనుషులు చనిపోయారు.ఊపితేనే పడిపోయేంత నాసిరకంగా ఉన్న తీగల వంతెనలపై నడవాలంటేనే ఇప్పుడు ప్రజలకు వణుకు పుడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో కొందరు టూరిస్టులు అందరికీ ఆగ్రహం తెప్పించే ఓ పని చేశారు.

అదేంటంటే వారు వేలాడే వంతెన పై ఏకంగా కారునే నడిపారు.ఆ కారు బరువుకి తీగల వంతెన తెగిపోయి ఉంటే వారి పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకోవడానికే భయం వేస్తోంది.

వివరాల్లోకి వెళితే.కర్ణాటక రాష్ట్రం, ఉత్తర కన్నడ జిల్లా, యెల్లపురాలో శివపుర అనే ఓ కేబుల్ బ్రిడ్జి ఉంది.

కాగా తాజాగా ఈ కేబుల్ బ్రిడ్జిపైకి కొందరు టూరిస్టులు కారును నడిపించారు.ఇదొక పర్యాటక ప్రాంతం కాగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు.

అయితే ఈ కారును నడిపించిన వారు మహారాష్ట్రకి చెందిన వారిని తెలిసింది.ఈ టూరిస్టులు సస్పెన్షన్ బ్రిడ్జిపైకి కారును ఎక్కించిన వెంటనే స్థానికులు చాలా ఆందోళన పడ్డారు.

అది కూలిపోతే అందరూ చచ్చిపోతారని స్థానికులు వారిని తిడుతూ కారుని అడ్డగించారు.అయినా కూడా ఆ కారు డ్రైవర్ ముందుకు వెళ్తూనే ఉన్నాడు.

చివరికి స్థానికులు కొట్టేటట్టు మాట్లాడటంతో భయపడిన వారు కారు రివర్స్ లో నడిపించారు.

అదృష్టవశాత్తు ఈ వంతెన ఆ కారు బయటికి వెళ్లేంతవరకు కూలిపోలేదు.దాంతో వారు బతికిపోయారు.

సోషల్ మీడియాలో ఈ టూరిస్టులు చేసిన పిచ్చి పనికి సంబంధించి ఒక వీడియో వైరల్‌ అయింది.

వీడియోలో స్థానికులు కారును వెనక్కి వెళ్ళిపోమని చెప్పడం చూడవచ్చు.ఆ తర్వాత కారు వెనక్కి వెళ్తుండడం మీరు గమనించవచ్చు.

అనంతరం కారుని స్థానికులు వెనక్కి తోశారు.కారు వెనుక కూడా చాలా మంది ఉన్నారు.

"""/"/ కారు వెనక్కి తోసేప్పుడు బ్రిడ్జి ఊగుతూ కనిపించడంతో గుండె జల్లు ఉన్నదని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కొందరు మాత్రం పిచ్చి పట్టిందా అని వారిని తిడుతున్నారు.వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు ఒక చేసుకోవడం నమోదు చేశారు.

గ్లోబర్ స్టార్ తో కమిడియన్ చేసిన అల్లరి అంత ఇంత కాదుగా.. వీడియో వైరల్