సాగ‌ర్ ప్రాజెక్టుకు ప‌ర్యాట‌కుల ర‌ద్దీ

నల్గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుకు ప‌ర్యాట‌కుల ర‌ద్దీ పెరిగింది.ఎగువ నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌ల‌తో ప్రాజెక్టు నిండుకుండ‌లా ద‌ర్శ‌నమిస్తోంది.

మ‌రోవైపు వీకెండ్ కావ‌డం, వ‌రుస సెల‌వులు రావ‌డంతో సాగ‌ర్ అందాల‌ను వీక్షించేందుకు ప‌ర్యాట‌కులు భారీగా త‌ర‌ల వ‌స్తున్నారు.

దీంతో నాగార్జున‌సాగ‌ర్ కొత్త బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.ఈ క్ర‌మంలో సుమారు రెండు కిలో మీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచి పోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది..: సీఎం రేవంత్