ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా…?
TeluguStop.com
తెలుగులో అప్పట్లో ప్రముఖ సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన "నువ్వు నేను" అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి బాలీవుడ్ బ్యూటీ అనిత హాస్సానందిని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈమె వచ్చీరావడంతోనే పర్వాలేదని పించడంతో తెలుగు, హిందీ, కన్నడ, తదితర భాషలలో వరుస అవకాశాలు దక్కించుకుంది.
అయితే తెలుగులో ఎక్కువగా నటి అనిత స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
అయితే ఒకప్పుడు చేతినిండా వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
దాంతో ముంబైలోనే సెటిల్ అయింది.పెళ్లయిన తర్వాత కూడా అడపాదడపా చిత్రాలలో నటించినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
దీంతో పలు ధారావాహికలలో నటించే అవకాశాలను దక్కించుకుంది.ఇందులో భాగంగా తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ లో నాగిని సీరియల్ లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నాటి అనిత హీరోయిన్ గా నటించిన నువ్వు నేను, నిన్నే ఇష్టపడ్డాను, తొట్టి గ్యాంగ్, ఆడంతే అదో టైపు, శ్రీరామ్ తదితర చిత్రాలు ఈ అమ్మడుకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
కాగా ప్రస్తుతం అనిత తన కుటుంభ సభ్యులతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే..: మంత్రి జోగి రమేశ్