టాలీవుడ్‌ లో కనిపిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌

టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కరోనాను జయించింది.

ఆమె కరోనా వల్ల పెద్దగా ఇబ్బంది పడలేదు.కాని ఆ సమయంలో తాను పడ్డ ఆందోళన గురించి ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ వచ్చింది.

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.ఆమె కరోనాను జయించింది.

ఇప్పుడు రామ్‌ చరణ్‌ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.ఈమద్య కాలంలో వరుసగా టాలీవుడ్‌ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.

బయట ఎక్కడ కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ కనిపించడం లేదు కాని టాలీవుడ్‌ లో మాత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ ఎక్కువగా కనిపిస్తుందనే వార్తలు వస్తున్నాయి.

ఇండస్ట్రీలో చాలా మందికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.కాని ఈమద్య కాలంలో అది ఎక్కువ అవ్వడంతో ముందు ముందు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కారణంగా టాలీవుడ్‌ లో ఇంకా కొందరు ప్రముఖులు షూటింగ్‌ ను మొదలు పెట్టలేదు.

కొందరు షూటింగ్‌ కు వెళ్లగా అక్కడ కరోనా నిర్థారణ అవ్వడంతో ఆగిపోయారు.మొత్తానికి కరోనా అనేది చాలా ఇబ్బంది కరంగా మారింది.

షూటింగ్ జరిపితే ఒక నష్టం, జరపకుంటే ఒక నష్టం అన్నట్లుగా పరిస్థితి ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా ఇండస్ట్రీలో మాత్రం కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.

కరోనా బారిన పడ్డ రామ్‌ చరణ్‌ వెంటనే కోలుకోవాలని ఆశిస్తున్నారు.ఆయన ఇటీవల చిరంజీవి తో పాటు ఆచార్య సెట్‌ లో చాలా మందిని కలిశాడు.

కనుక ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయేమో అంటున్నారు.అందుకే మెగా అభిమానులు ఏ నిమిషంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ టెన్షన్‌ పడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయనున్నారా..? అసలేం జరిగిందంటే..?