పాపం.. స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చి పత్తా లేకుండా పోయిన హీరోయిన్…

తెలుగులో 2010వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు ఎస్.జె సూర్య దర్శకత్వం వహించిన "పులి" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ "నిఖిషా పటేల్" గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

అయితే తెలుగులో తన మొదటి చిత్రంపెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ కన్నడలో మాత్రం వరుసగా మూడు చిత్రాలలో నటించే అవకాశం దక్కించుకుంది.

కానీ ఈ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించలేక పోయాయి.

తెలుగులో నిఖిషా పటేల్ హీరోయిన్ గా నటించిన ఓం 3డి, అరకు రోడ్డు లో తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

దీంతో ఈ అమ్మడు తెలుగులో అవకాశాల దక్కించుకోలేక చివరికి సినిమాలకే గుడ్ బై చెప్పేసింది.

దీంతో ఈ అమ్మడు సినిమాలకు స్వస్తి చెప్పిన అనంతరం తన స్వస్థలం అయినటువంటి లండన్ కి వెళ్ళి పోయింది.

అయితే ప్రస్తుతం లండన్ లో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరి నటనలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటూ హాలీవుడ్ చిత్రాలలో నటించేందుకు ప్రయత్నిస్తోంది.

ఏదేమైనప్పటికీ వచ్చి రావడంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో నిఖిషా పటేల్ తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయిందని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ నెలకే రూ.19 లక్షలు సంపాదిస్తున్న మహిళ..!!