Pamancham : టాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద ఫ్లాప్ సినిమా ఏదో తెలుసా.. ?
TeluguStop.com
ఒక సినిమాని తెరకెక్కించడం అంత తేలికైన విషయం కాదు.ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, టెక్నీషియన్స్కి కొన్ని సినిమాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
సినిమా నిర్మాత డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే సినిమా తీస్తాడు.పెట్టుబడి పెట్టిన డబ్బుకి కొంత లాభం వస్తే సంతోషిస్తాడు.
అంత లాభం రాకపోయినా, ఖర్చు అయిన డబ్బు మాత్రం తిరిగి వస్తే మరో సినిమా తీసే అవకాశం ఉంటుంది.
కానీ, పెట్టిన డబ్బులో ఒక్క రూపాయి కూడా తిరిగి రాకపోతే ఆ నిర్మాత పరిస్థితి చాలా దుర్భరంగా మారుతుంది.
సినిమానే జీవితంగా భావించే నిర్మాతలకు ఇది చాలా బాధాకరమైన విషయం.కొంతమందికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేకపోయినా, డబ్బు ఉంది కదా అని సినిమా నిర్మాణంలోకి దిగుతారు.
ఈ తరహా వ్యక్తులకు సినిమా ఎలా తీయాలి, దాని వ్యాపారం ఎలా ఉంటుంది అనే విషయాలపై అవగాహన ఉండదు.
దీనివల్ల వారు చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.70 సంవత్సరాల క్రితం విడుదలైన 'ప్రపంచం' సినిమా ( Prapancham )ఇలాంటి పరిస్థితిని చక్కగా చిత్రీకరించింది.
సినిమా ఎవరు తీసారో తెలుసుకుందాం పదండి. """/" /
మునాస్ ( Munas )అనే ఒక వ్యాపారవేత్తకు సినిమాలపై చాలా ఆసక్తి ఉండేది.
'సావిత్రి సత్యవాన్'( Savitri Satyawan ) సినిమాను 79 సార్లు చూసినంతగా ఆ సినిమా అతనికి నచ్చింది.
తాను కూడా ఒక అద్భుతమైన సినిమా నిర్మించాలని భావించాడు.భార్య సహాయంతో ఒక కథను రాసి, సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.
30 లక్షల బడ్జెట్ కేటాయించాడు- ఆ రోజుల్లో ఒక సినిమాకి అది చాలా భారీ బడ్జెట్.
50కి పైగా సెట్టింగ్స్, 160 మంది నటీనటులను తీసుకున్నాడు.సాంఘిక చిత్రం అయినా భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టాడు.
2,50,000 అడుగుల ఫిలిం, అనేక రీ షూట్లు చేయించాడు.101 థియేటర్లలో విడుదల - అప్పట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు.
హెలికాప్టర్ల ద్వారా పబ్లిసిటీ ఇచ్చి సినిమా ప్రమోషన్లో కొత్త పుంతలు తొక్కించాడు. """/" /
మునాస్ భార్య రాసిన కథను చాలా మంది డైరెక్టర్లు తిరస్కరించారు.
చివరికి రామచంద్రన్( Ramachandran ) అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడానికి ఒప్పుకున్నాడు.
తెలుగులో 'ప్రపంచం', తమిళంలో 'ఉళగం' పేర్లతో ద్విభాషా చిత్రంగా నిర్మాణం.ఇందులో సినిమాలో 16 పాటలు ఉన్నాయి.
శ్రీశ్రీ, ఆరుద్ర పాటలు రాశారు.ఇందులో కాంచన, జి.
వరలక్ష్మీ, వల్లం నరసింహారావు, షావుకారు జానకి, రామశర్మ ప్రధాన పాత్రలు పోషించారు.నాగయ్య అతిథి పాత్ర చేశారు.
3 సంవత్సరాల షూటింగ్, భారీ బడ్జెట్, హాలీవుడ్ కంపెనీ ద్వారా పబ్లిసిటీ, మొట్టమొదటిసారి హెలికాప్టర్ ద్వారా పబ్లిసిటీ ఇవ్వడం కారణంగా నిర్మాతకు ఖర్చు తడిసి మోపడి అయింది.
1953లో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులకు అర్థం కాని కథతో వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
తొలి రోజు థియేటర్లో హడావిడి ఉంది కానీ మరుసటి రోజు నుండి ప్రేక్షకుల దూరం అయ్యారు వెరసి నిర్మాతకు భారీ నష్టం వాటిల్లింది.
ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద ఫ్లాప్ సినిమాగా నిలిచింది.అతడు ఖర్చు పెట్టిన రూ.
లక్షల్లో ఒక్క లక్ష కూడా వెనక్కి తిరిగి రాలేదు.
గౌతమ్ తిన్ననూరి కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు…