కళ్ళతో మాయ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై ఉండే బ్యూటిఫుల్ యాంకర్స్ లో ఎవరు అంటే అనసూయ అని చెప్పేస్తారు.

కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా అటు వెండితెరపై కూడా పలు అవకాశాలను దక్కించుకుని తనదైన శైలిలో దూసుకుపోతోంది.

అయితే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అనసూయ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తన అందంతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా గ్లామర్ గా రెడీ అవుతూ, నిత్యం మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక వెండితెరపై సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.

ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో మంగళం శ్రీను భారీగా నటించి ఆకట్టుకుంది.

అంతేకాకుండా ప్రస్తుతం అనసూయ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. """/" / ఆచార్య సినిమాతో పాటు ఖిలాడి, పక్కా కమర్షియల్, రంగమార్తాండ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే భీష్మపర్వం అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీ కికూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.ఇదిలా ఉంటే తాజాగా అనసూయకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2021 ఎండ్ అవుతున్న ఈ సందర్భంగా అనసూయ తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.

ఈ ఏడాది 12 నెలల కాలంలో తన జీవితంలో జరిగిన పలు సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఈ వీడియోని చేసింది.

ఈ వీడియోను చూసిన అభిమానులు ఆమెకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే హ్యాపీగా ఉండాలి అంటూ విష్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయ్యయ్యో.. పెళ్లిపీటలపై నిద్రపోయిన పెళ్లికూతురు.. వీడియో వైరల్