అంతా నన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంటోంది.. వైష్ణవ్ తేజ్ కామెంట్స్ వైరల్!

ఉప్పెన సినిమాతో హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.

తొలి సినిమాతోనే ఈ హీరో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కొండపొలం సినిమా నేడు థియేటర్లలో రిలీజవుతోంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించగా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

నేడు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.అడవి బ్యాక్ డ్రాప్ లో కొత్తదనం ఉన్న కథతో ఆలోచింపజేసే మాటలతో కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన కొండపొలం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం.

వైష్ణవ్ తేజ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ తాను కొండపొలం గురించి ఎప్పుడూ వినలేదని చెప్పుకొచ్చారు.

ఆ కారణం వల్లే కథ విన్న సమయంలో కొత్తగా అనిపించిందని వైష్ణవ్ వెల్లడించారు.

"""/"/ కొండపొలం కథలో ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయని వైష్ణవ్ చెప్పుకొచ్చారు.

సినిమాలో మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులు కూడా ఉంటాయని వైష్ణవ్ కామెంట్లు చేశారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గమ్యం, వేదం సినిమాలు తనకు ఎంతో ఇష్టమని వైష్ణవ్ వెల్లడించారు.

వెబ్ సిరీస్ లలో తనకు అవకాశాలు రాలేదని వస్తే మాత్రం నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వైష్ణవ్ పేర్కొన్నారు.

నాకు ఒక ఇమేజ్ వస్తుందని తాను అనుకోలేదని బయటకు వెళ్లిన సమయంలో అంతా నన్ను చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుందని వైష్ణవ్ కామెంట్లు చేశారు.

ఉప్పెనతో హిట్ కొట్టిన వైష్ణవ్ రెండో సినిమాతో కూడా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడం గమనార్హం.

హీరో వైష్ణవ్ తేజ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చావా.? పవన్ కు ముద్రగడ ప్రశ్న