పేదింటి ఆడపడుచు వివాహానికి పుస్తే మెట్టెలు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శనిగరపు మౌనిక వివాహం బండలింగంపల్లి కి చెందిన కొడిముంజ బాబు తో సోమవారం బండలింగంపల్లి లో జరుగగా ఆమె వివాహానికి నేవూరి కీ.

శే.నేవూరి మల్లారెడ్డి లక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మౌనిక కు పుస్తే మెట్టెలు అందజేశారు.

నేటితో పుస్తే మెట్టెలు అందజేసిన సంఖ్య 1006 కి చేరుకుంది.మౌనిక తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోగా ఆమెను ఆమె మేనమామ విశ్వనాథం పెంచి పోషించినారు.

నేవూరి వెంకట్ రెడ్డి ఇచ్చిన పుస్తే మెట్టెలను ఎడ్ల సందీప్,బాబు,సల్మాన్ అందజేశారు.ఈ సందర్భంగా యువతి మేన మామ, ఆమె బందువులు, గ్రామస్తులు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకులను అలరించే చిత్రాలివే.. సరికొత్త రికార్డ్స్ ఖాయమా?