నేడు సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన..!!
TeluguStop.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు."నాడు- నేడు" రెండో దశ పనులకి జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
పి గన్నవరం పోతవరం మండలంలోని జడ్పీ హైస్కూల్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇదే సమయంలో "జగనన్న విద్యా కానుక" కిట్లు.విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
ఇదిలా ఉంటే సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో.పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
"""/" /
ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
సెక్యూరిటీ కి ఒక అడిషనల్ ఎస్ పి.తొమ్మిది మంది డీఎస్పీలు, 25 ఇన్స్పెక్టర్లు, 60 మంది ఎస్ఐలు సీఎం కార్యక్రమానికి విధులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తెలియజేశారు.
గత శనివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటన తర్వాత ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి జగన్ వస్తూ ఉండటంతో ఉభయగోదావరి జిల్లాల వైసిపి నాయకులు.
సీఎం జగన్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.
Ram Pothineni : ఇస్మార్ట్ శంకర్ తో రామ్ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే..?