పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకే టీజేఎస్ మద్దతు: ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా: నల్లగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో( MLC By-elections ) తెలంగాణ జన సమితి (టీజేఎస్) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు టీజేఎస్( TJS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 27 న జరగనున్న నల్గొండ,ఖమ్మం,వరంగల్ శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పూర్తి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీజేఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారని ధర్మార్జున్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!