కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై టీజేఎస్ రణదీక్ష
TeluguStop.com
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో లోపాలున్నాయని, నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్.
కోదండరామ్ రణదీక్ష చేపట్టారు.హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసన దీక్ష కొనసాగనుంది.
కాళేశ్వరం వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ప్రాజెక్టు డిజైన్ లోపం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
సంతకాల సేకరణ, వినతిపత్రాల సమర్పణతో పాటు అవసరమైతే పాదయాత్ర కూడా చేపడతామని కోదండ రామ్ స్పష్టం చేశారు.
షాంపూ జుట్టుకే కాదు ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా?