సద్దుమణిగిన తిరుపతి వడమాలపేట టోల్ ప్లాజా వివాదం

తిరుపతి జిల్లా వడమాలపేట టోల్ ప్లాజా వివాదం సద్దుమణిగింది.టోల్ ప్లాజా వద్ద తమిళనాడుకు చెందిన యువ న్యాయవాదులపై స్థానికులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై తమిళనాడు యంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎస్పీని కలిశారు.

టోల్ ప్లాజా వద్ద లాయర్స్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

న్యాయవాదుల అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.

దీంతో వివాదం సద్దుమణిగింది.మరోవైపు వివాదం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి అలా చేసేవాళ్లు.. బంగారం మూవీ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!