మీరు వ్యాపారం చేయాలనుకుంటే ...ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

మీరు ఉద్యోగం చేస్తే మీ కుటుంబాన్ని మాత్రమే పోషించగలరు.అయితే మీరు నిజంగా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకుంటే వ్యాపారం చేయాలి.

వ్యాపారం కోసం మీరు మీ డబ్బును పెట్టుబడిగా పెడతారు.ఇటువంటి సందర్భంలో ఒకరి మాటలు వినడం లేదా ఒకరిని అనుసరించేముందు పదిసార్లు ఆలోచించాలి.

వ్యాపారాన్ని ప్రారంభించడం దానిని అభివృద్ధి చేయడం గురించి ఆచార్య చాణక్య పేర్కొన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైనా ఏ పనినైనా ప్రారంభించాలనుకుంటే దాని గురించి పూర్తి సమాచారం తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు.

ఆ రంగం గురించి తెలుసుకోవాలంటే అధ్యయనం చేయాలి.ఎందుకంటే విషయ పరిజ్ఞానం సరైన మార్గాన్ని చూపుతుంది.

ఆ వ్యాపారంలోని ప్రయోజనాలు, అప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే దానిలో ముందుకు సాగడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.

పూర్తి సన్నద్ధతతో మీ పనిని ప్రారంభించాలి.మీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు, మొదట్లో మీ పనిని హీనపరిచే మాటలను తోటివారి నుంచి వినవలసి వస్తుందని.

ఇది మీ నమ్మకాన్ని బలహీనపరుస్తుందని ఆచార్య తెలిపారు.మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి.

సరైన దిశలో కష్టపడి పనిచేయాలి.మీరు కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నప్పుడు.

దాని గురించి ఇతరులకు కూడా తెలియజేయవద్దు.మీ ప్లాన్‌ను ఎవరితోనూ చేప్పుకోవద్దు.

అలాచేస్తే మీరు చేయాలనుకుంటున్న పనిలో ఆటంకాలు ఎదురుకావచ్చు.మీరంటే అసూయపడే వ్యక్తులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు.దానిని మధ్యలో ఆపవద్దు.

తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సానుకూలతతో ముందుకు సాగండి.ఇటువంటి సందర్భాల్లో చాలాసార్లు రిస్క్ తీసుకోవాల్సి వస్తుందని ఆచార్య తెలిపారు.

ఇందుకోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.అలాగే రెండవ ఎంపికను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచండి.

కటువుగా మాట్లాడేవారు ఎప్పటికీ వ్యాపారం చేయలేరు.మధురంగా మాట్లాడితేనే జనాన్ని ఆకట్టుకోవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు.

Nandyala Memantha Siddham Yatra : నంద్యాల జిల్లాలో వైసీపీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర