హైదరాబాద్ గాంధీభవన్ లో టికెట్ల టెన్షన్..!

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టికెట్ల టెన్షన్ మొదలైంది.ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదిక ఇవాళ స్క్రీనింగ్ కమిటీ ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఉదయం 11 గంటల నుంచి పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది.

అదేవిధంగా సాయంత్రం వరకు వన్ టు వన్ సమావేశాలు కొనసాగనున్నాయి.పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్ కమిటీ రేపు సమావేశం కానుందని సమాచారం.

పీఈసీ మరియు ఇతర నేతల అభిప్రాయాలను అనుసరించి ఈ నెల 6వ తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేయనుంది.

తరువాత ఈనెల 7న సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ నివేదిక అందించనుంది.

డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కోవిడ్ కలకలం.. పలువురికి పాజిటివ్‌