నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు.మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

కావలి మండలం మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వాతంత్ర్యం అంటే ఇదేనా… గౌరవం ఎక్కడ ఉంది.. ఉపాసన పోస్ట్ వైరల్!