అనుమానంతో మహిళలను దారుణంగా.. ?

ప్రస్తుతం సమాజంలో ఏ విషయం పట్ల అయినా ఒక పుకారు అత్యంత వేగవంతంగా ప్రజల్లోకి వెళ్లుతుంది.

అది నిజమా, కాదా అని నిర్ధారించుకోకుండానే దాన్ని సోషల్ మీడియాలో పదిమందికి పంచడం అలవాటు అయ్యింది.

ఇలాంటి సంఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.ఇకపోతే గత రెండు రోజుల కిందట దొంగబాబాల రూపంలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా తిరుగుతోందంటూ కొందరిని గ్రామస్తులు చితకబాదిన సంగతి తెలిసిందే.

"""/"/ ఆ ఘటన మరువక ముందే కామారెడ్డి జిల్లాలో మహిళలను చితకబాదిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ముగ్గురు మహిళలు అనుమానస్పదంగా తిరుగుతూ ఉండటంతో, అక్కడి గ్రామస్తులు వారిని, ఎవరని నిలదీయగా, మహిళలు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, పిల్లలను ఎత్తుకెళ్లే వాళ్లు కావచ్చూ అనే అనుమానంతో తీవ్రంగా కొట్టారట.

కొట్టొద్దని చేతులెత్తి దండం పెట్టినా వదలకుండా ఇరగదీసారట.ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు వనపర్తి జిల్లాకు చెందిన వారని తెలిసిందట.

ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సమాచారం.

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన..!