ఆరోపణలు చేసే వారిని ఉరికిచ్చి కొడతాం.. :రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది.దీనిలో భాగంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.తనపై ఆరోపణలు చేసే వారిని ఉరికిచ్చి కొడతామన్నారు.

కేసీఆర్ దగ్గర మాట్లాడలేని దద్దమ్మలు.తన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సంతలో పశువుల్లా నాయకులను కొంటున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో నాయకులు అమ్ముడుపోవద్దు.

ఆగం కావొద్దని సూచించారు.ఆకలినైనా చంపుకోవాలని కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దన్నారు.

మునుగోడు దెబ్బకు కేసీఆర్ అబ్బా అనాలని చెప్పారు.

పెళ్లి పీటలెక్కనున్న నాగచైతన్య శోభిత.. వైరల్ అవుతున్న వార్తల్లో అసలు నిజాలు ఇవే!