నిమ్మకాయ తినే వారు మర్చిపోయి కూడా.. ఈ పదార్థాలతో కలిపి తినకండి..!
TeluguStop.com
మనం ఆహారం తీసుకునేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ఆహారాలను కలిపి తింటూ ఉంటాము.
అలా తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అంతే కాకుండా కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల అవి విషపూరితము అయ్యే అవకాశం కూడా ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అలా తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే అరటి పండు, జామకాయలు ( Bananas Guavas )ఈ రెండు ఏడాది పొడుగునా లభిస్తూ ఉంటాయి.
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. """/" /
అయితే జామకాయ, అరటిపండు కలిపి తింటే గ్యాస్, తలనొప్పి, కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అరటి పండు,పైనాపిల్ రెండిటిని కూడా కలిపి తినకూడదు.ఇవి రెండు త్వరగా జీర్ణం కావు.
దాంతో ప్రమాదకరమైన టాక్సిన్స్ విడుదలై కడుపు నొప్పికి కారణం అవుతాయి.కాబట్టి కొన్ని ఆహారాలను కలిపి తీసుకోకుండా ఉంటే మంచిది.
అలాగే పాలు, పనసపండు కలిపి తినకూడదు.ఇలా తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
బొప్పాయి పండు, నిమ్మరసం కలిపి తీసుకోకూడదు.ఇలా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది.
దాంతో రక్తహీనత సమస్య ( Anemia Problem )వచ్చే అవకాశం ఉంది.
"""/" /
ఎందుకంటే నిమ్మకాయలో ( Lemon )ఉండే సిట్రస్ పాలు విరిగి పోయేలా చేస్తుంది.
ఇవి రెండిటిని ఒకేసారి తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న జీర్ణ రసాలతో కలిసి ఎక్కువ యాసిడ్స్ ని విడుదల చేస్తాయి.
దీంతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది.రాత్రి సమయంలో ఉసిరి పచ్చడి, నిమ్మకాయ పచ్చడి తినకూడదని చెబుతున్నారు.
ఆ సమయంలో పచ్చళ్ళు తింటే మెదడులో సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులు పగిలిపోయే అవకాశం ఉంది.
దాని వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.అందువల్ల కొన్ని ఆహారాలను ఇలా కలిపి తీసుకోకూడదు.
భారతీయుడు 2 ఓటిటి డేట్ వచ్చేసిందా..? ఎందులో స్ట్రీమింగ్ అవ్వబోతుంది…