రక్తహీనత నుంచి అధిక బరువు వరకు ఎన్నిటికో చెక్ పెట్టే సూపర్ డ్రింక్ మీకోసం!
TeluguStop.com
రక్తహీనత.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధిస్తున్న సమస్య ఇది.
అలాగే అధిక బరువుతో కూడా ఎందరో బాధపడుతున్నారు.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ఒకటి ఉంది.
ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత, అధిక బరువుతో సహా ఎన్నో అనారోగ్య సమస్యల్లో నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ డ్రింక్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు కివి పండ్లను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కివి పండు ముక్కలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధమవుతుంది.
"""/" /
ఈ డ్రింక్ ను వారంలో కనీసం నాలుగు సార్లు తీసుకోవాలి.
ఇలా చేస్తే రక్తహీనత సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.
అతి ఆకలి దూరం అవుతుంది.దాంతో క్యాలరీలు త్వరగా కరుగుతాయి.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు. """/" /
అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.కంటి చూపు అద్భుతంగా మెరుగుపడుతుంది.
సంతాన సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.
చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.చర్మం పై మొండి మచ్చలు ఉంటే మాయం అవుతాయి.
మరియు ఇమ్యూనిటీ సిస్టం కూడా బూస్ట్ అవుతుంది.
వైరల్ అవుతున్న టర్కిష్ వ్లాగర్ దేశీ ఫుడ్ టూర్.. వీడియో చూస్తే ఫిదా..