దుష్టశక్తులు మీ ఇంటిని వదిలిపోవాలంటే ఈ పనులు చెయ్యండి!

సాధారణంగా మనం ఇంట్లో చేసే కొన్ని పనుల వల్ల లేదా కొన్ని వస్తువుల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు.

అయితే కొన్ని వస్తువులు పలాన చోటే ఉండాలని మనకు వాస్తు శాస్త్రం చెప్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ వాస్తు శాస్త్రం ఆధారంగా కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాం.

ఇలా నిర్మించుకున్న ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతుంటారు.అయితేకొన్ని మనం చేసే పనుల వల్ల మన ఇంట్లో దుష్ట శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అలాంటప్పుడు ఇంట్లో మానసిక ప్రశాంతత దూరం అవ్వడమే కాకుండా, అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మరి మనం చేసే ఆ చిన్న తప్పు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.కుటుంబంలో ఎవరూ కూడా బారెడు పొద్దెక్కిన దాకా నిద్ర పోకూడదు.

ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.అంతేకాకుండా కుటుంబంలో కలహాలు, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

మన పూజ గదిలో ఉన్న విగ్రహాలు, చిత్రాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయి.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన నెయ్యితోచేయడం వల్ల ఎంతో గొప్ప ఫలితాలు కలిగి ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది.

అంతేకాకుండా దేవుని గదిలో విలువైన వస్తువులను దాచిపెట్టడం ద్వారా మన ఇంట్లో సిరి సంపదలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

మన ఇంటి ప్రధాన ముఖ ద్వారం దక్షిణం వైపు ఉండకూడదు.అలా ఉండడం వల్ల ఇంటి యజమానికి ప్రమాదం జరుగుతుంది.

ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి వినాయకుడి చిత్రాన్ని ముఖద్వారంపై పెట్టాలి.ఇలా చేయడం ద్వారా దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది.

ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో ఎవరు గొడవ పడుతూ అన్నం విసిరేయడం వంటి పనులు అసలు చేయకూడదు.

అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావడం వల్ల ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మన ఇంట్లో పూజ ఉండడం లేదా సాలెపురుగులు కూడా నిర్మించడం వంటివి అస్సలు ఉండకూడదు.

సాలెగూడు రాహువు ప్రభావం కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కానీ మంగళవారం శుక్రవారం సమయాలలో ఇంట్లో బూజు శుభ్రం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

చైతన్యలో ఆ లక్షణాలు అంటే ఇష్టమంటున్న శోభిత.. హుందాగా ప్రవర్తిస్తాడంటూ?