ఈ జీపులో కేవలం రూ.5లతో 70 కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చు.. తెలుసా?

పెట్రోల్, డీసెల్ ధరలు ఆకాశాన్నంటున్నవేళ కొంతమంది ప్రతిభగల యువకులు ప్రత్యామ్నాయ మార్గాలగురించి వెతుకుతున్నారు.

ఈ క్రమంలోనే ఓ యువకుడు వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చాడు.పంజాబ్​​కు చెందిన గురుచరణ్​ సింగ్ అనే అతను లేటెస్ట్​ టెక్నాలజీతో ఈ-జీప్​​ను తయారు చేశాడు.

ఒక్క యూనిట్​ ఛార్జ్​ చేస్తే సుమారు 70 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని చెబుతున్నాడు.

ఇక ఇటీవలికాలంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుతుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం బాగా పెరిగింది.

ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్స్, కార్ల​ను ప్రవేశపెట్టాయి.ఈ నేపథ్యంలో పంజాబ్​కు చెందిన ఓ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ జీప్​ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ వాహనం నిర్వహణకు తక్కువ ఖర్చు అవడమే దానికి అసలైన కారణం.ఈ-జీప్​​ కేవలం ఒక యూనిట్​ ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం.

గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.బటిండా జిల్లాలోని విశ్వకర్మ మార్కెట్‌లో ఉన్న డెంటింగ్ పెయింటర్ గురుచరణ్ సింగ్ ఎలక్ట్రిక్ జీప్‌ను రూపొందించాడు.

ఇంతకుముందు మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు తయారీ సంస్థలు ఫైబర్‌ మెటీరియల్​ను ఉపయోగించాయని, అయితే తాము అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ జీప్‌లో ఇనుము ఉపయోగించామని సింగ్ చెప్పడం హర్షణీయం.

అయితే దీని నిర్మాణానికి దాదాపు 7 రోజులు పట్టిందని తెలిపాడు.ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ.

"దేశంలో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో నాకు ఈ ఐడియా తట్టింది.

ఆ ఆలోచనలోనుండే ఈ జీప్ ని ఆవిష్కృతం చేయడం జరిగింది.ఈ ఎలక్ట్రిక్ జీప్ ధర దాదాపు రూ.

15 లక్షలు ఉంటుంది.మా ప్రాంతానికి వచ్చే కొత్త వారు ఈ జీప్​ను చూసి ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసేందుకు ఆర్డర్‌ను అందుకున్నాను.పెరుగుతున్న చమురు ధరల నుంచి ప్రజలు విముక్తి పొందుతారు.

ఈ ఎలక్ట్రానిక్ జీప్​ సమర్థంగా పనిచేస్తుంది." అని అన్నాడు.

కొండాపూర్‎లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల విక్రయ ముఠా అరెస్ట్..!