మహేష్ బాబు దుబాయ్ ట్రిప్ సీక్రెట్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్ళి ఎంతో ఆనందంగా గడుపుతుంటారు.

ఈ సందర్భంలోనే గత కొద్ది రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి యూఎస్ వెళ్లి తిరిగి వచ్చిన మహేష్ బాబు మరోసారి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన కుటుంబంతో కలిసి కనిపించారు.

అయితే ప్రస్తుతం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రీకరణలో భాగంగా దుబాయ్ వెళ్లనున్నట్లు మహేష్ అభిమానులు భావించారు.

కానీ మహేష్ బాబు మాత్రం దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఇలా మహేష్ బాబు ఉన్నఫలంగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లడానికి గల కారణం తన వైఫ్ నమ్రత పుట్టిన రోజు జనవరి 22న కావడంతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి దుబాయ్ లో ప్లాన్ చేశారట మహేష్ బాబు.

"""/"/ దుబాయ్ లో ఒక వైపు తన భార్య పుట్టినరోజు వేడుకలను జరుపుతూనే మరోవైపు సర్కారు వారి పాట చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ ఈ చిత్రం జనవరి 29 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో దుబాయ్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుందని చిత్ర బృందం తెలియజేశారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన డేట్స్ కూడా కేటాయించిందంట.

ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసింది.ప్రస్తుతం మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదట ఎంతో పద్ధతిగా కనిపించిన హీరోయిన్లు.. ఇప్పుడు గ్లామర్ డోస్‌ పెంచేశారుగా..??