ఏపీ బీజేపీ అధ్యక్ష మార్పుపై సోము వీర్రాజు స్పందన ఇదే..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ( BJP ) హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు సంచలనంగా మారింది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును( Somu Veeraju ) పక్కకు తప్పించి.

ఆయన స్థానంలోకి పురందేశ్వరిని( Purandheswari ) నియమించడం జరిగింది.ఈ పరిణామం పట్ల సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.తనని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం పట్ల ఎలాంటి బాధ లేదని.

ముందులానే పనిచేస్తానని వ్యాఖ్యానించారు.ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి ఔషధంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

"""/" / ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దశ దిశ లేనట్టు ఉన్నాయి అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

బీజేపీ పార్టీలో వివిధ స్థాయిలో ఆమె సేవలందించారని కొనియాడారు.ఆమె అపర రాజకీయ అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ విస్తరణ మరియు బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదేవిదంగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎంపికైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కాలినడకన తిరుమలకు వెళ్లిన నాని.. ఈ స్టార్ హీరో భక్తికి ఫిదా అవ్వాల్సిందే!