మా పిల్లల మధ్య బంధాన్ని అవే బలోపేతం చేస్తాయి : మహేష్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రసెంట్ సినిమాలు చేస్తూనే బుల్లితెర ప్రేక్షకులను తన హోస్టింగ్ తో అలరిస్తున్నాడు.

ఆయన ప్రసెంట్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ షో ముగింపుకి చేరుకుంది.నిన్నటితో ఈ షో ఎండ్ అయినట్టు మేకర్స్ తెలిపారు.

ఇక లాస్ట్ ఎపిసోడ్ ను ప్రత్యేక గెస్ట్ తో ఎండ్ చేసారు.ఎవరు మీలో కోటీశ్వరులు షోకు లాస్ట్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేసారు.

నిన్న ఈ ఎపిసోడ్ జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.ఈ ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

ఇక నిన్న ప్రసారం అయిన ఎపిసోడ్ అందరిని అలరించింది.హోస్ట్ గా తారక్ వాక్ చాతుర్యం.

మహేష్ పంచులు అన్ని కలిపి ఈ ఎపిసోడ్ ను వినోద భరితంగా చేశాయి.

ఇక ఈ ఎపిసోడ్ లో తారక్ మహేష్ తో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చించాడు.

మహేష్ ఎప్పుడు చెప్పని విషయాలను కూడా ఈ షోలో ఎన్టీఆర్ చెప్పించాడు.సినీ నటులకు ఫ్యామిలీతో గడిపే అవకాశం చాలా తక్కువుగా ఉంటుంది.

ఎప్పుడు సినిమాల మధ్య వచ్చే గ్యాప్ లోనే వాళ్ళు కుటుంబంతో ఎంజాయ్ చేయాలి.

అయితే మహేష్ మాత్రం మిగతా వారికీ భిన్నంగా ఉంటాడు. """/" / మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఏడాదికి మూడు సార్లు వెకేషన్ కు వెళ్తూ ఉంటారు.

అయితే అంత పెద్ద స్టార్ అయ్యి  ఉండి ఏడాదికి మూడు సార్లు వెకేషన్ కు ఎలా వెళ్తాడా అని అటు అభిమానులతో పాటు తోటి నటులకు కూడా అనుమానం ఉంటుంది.

ఇక అదే విషయాన్నీ మహేష్ బాబును ఎన్టీఆర్ ప్రశ్నించగా మహేష్ బాబు సిన్సియర్ గా ఆన్సర్ చెప్పాడు.

మహేష్ ఈ ప్రశ్నకు సమాధానంగా.''తన పిల్లలతో పాటు ఏడాదికి మూడు వెకేషన్స్ ప్లాన్ చేస్తానని మహేష్ మాట ఇచ్చాడట.

ఈ పర్యటనలు మా పిల్లల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయ పడతాయి'' అని మహేష్ చెప్పుకొచ్చారు.

ఇక ఊటీ తన ఫెవరెట్ హాలిడే డెస్టినేషన్ అని మహేష్ చెప్పుకొచ్చారు.

పెడన సభలో మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ కీలక హామీ..!!