భారతదేశంలోని ప్రసిద్ధ గురుద్వారాలివే..

1.గురుద్వారా హర్మిందర్ సాహిబ్ సింగ్, పంజాబ్ అమృత్‌సర్‌లోని ఈ గురుద్వారా హర్మిందర్ సాహిబ్ సింగ్‌ను దర్బార్ సాహిబ్ లేదా గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు.

ఈ గురుద్వారా చాలా అందంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఇది భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా కూడా పేరొందింది.

మత విశ్వాసాల ప్రకారం ఈ గురుద్వారాను రక్షించడానికి మహారాజా రంజిత్ సింగ్ దాని పైభాగాన్ని బంగారంతో తాపడం చేయించారు.

అందుకే దీనికి గోల్డెన్ టెంపుల్ అని కూడా పేరు పెట్టారు.2.

గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్, ఉత్తరాఖండ్ గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్ ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది.

ఈ గురుద్వారా సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉంది.మంచు కారణంగా, ప్రయాణికుల భద్రత కోసం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు మూసివేస్తారు.

ఈ గురుద్వారా చాలా అందంగా ఉండటమే కాకుండా, చాలా మంచి నిర్మాణ కళకు ఉదాహరణగా నిలిచింది.

3.హజూర్ సాహిబ్ గురుద్వారా, మహారాష్ట్ర హజూర్ సాహిబ్ సిక్కుల 5 తఖ్త్‌లలో ఒకటి.

ఇది మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో గోదావరి నది ఒడ్డున ఉంది.ఈ గురుద్వారాను సచ్ ఖండ్ అని అంటారు.

గురుద్వారా లోపలి గదిని అంగీతా సాహిబ్ అంటారు.1708లో ఈ ప్రదేశంలో గురుగోవింద్ సింగ్‌ను దహనం చేశారని చెబుతారు.

ఈ గురుద్వారా మహారాజా రంజిత్ సింగ్ ఆదేశాల మేరకు 1832-1837 మధ్య నిర్మించబడింది.

4.గురుద్వారా పవోంటా సాహిబ్, హిమాచల్ ప్రదేశ్ పవోంటా సాహిబ్ గురుద్వారా పదవ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్‌కు అంకితమయ్యింది.

ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఉంది.ఈ ప్రదేశంలో గురు గోవింద్ సింగ్ తన జీవితంలో నాలుగు సంవత్సరాలు గడిపారు.

ఈ ప్రదేశంలో ప్రముఖ గ్రంథాన్ని రచించాడు.గురుద్వారాలో ఒక మ్యూజియం ఉంది.

దానిలో గురువు ఉపయోగించిన పెన్నులు, ఆ కాలంలో వాడిన ఆయుధాలను అందుబాటులో ఉంచారు.