Devi Sri Prasad : డబ్బు కంటే విలువలకే ప్రాధాన్యత ఇచ్చిన సెలబ్రిటీలు వీళ్లే.. ఏం జరిగిందంటే?

ప్రస్తుత రోజుల్లో మనుషులు మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువలు ఇస్తున్నారు.మనుషుల దేముంది ఈరోజు కాకపోతే రేపు వస్తారు డబ్బు ముఖ్యం బంధాల కంటే డబ్బు ముఖ్యం అని అనుకునే వారు చాలామంది ఉన్నారు.

ఒక్క సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అంతే కాకుండా డబ్బు కంటే విలువలకే ప్రాధాన్యత ఇచ్చే సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. """/" / టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్( Devi Sri Prasad ) కెరియర్ ఆరంభంలో కొందరు ప్రొడ్యూసర్లు హాలీవుడ్ ఆల్బమ్స్ ని తీసుకువచ్చి అందులో ఉన్న ట్యూన్స్ ని కాపీ కొట్టమని చెప్పేవారట.

కానీ దేవి శ్రీ ప్రసాద్ అలా చేయకుండా తనకు వచ్చిన వాటితో సొంతంగానే మ్యూజిక్ ని ట్రై చేశారట.

ఈ విషయంలో దేవిశ్రీప్రసాద్ నిజంగా గ్రేట్ అని చెప్పాలి.అలాగే హిట్టు 2 సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కోమలి ప్రసాద్( Komalee Prasad) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో నేను తెలుగు అమ్మాయిని కాదు.

హిందీ అమ్మాయిని అని చెప్పు ఎందుకంటే ఇక్కడ అవకాశాలు రావు అని కొంతమంది ఆమెకు సజెస్ట్ చేశారట.

"""/" / కానీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆమె అవేమీ పట్టించుకోకుండా తాను తెలుగు అమ్మాయిని అని పరిచయం చేసుకుంది.

ఇలా ఈ వరుసలో టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh ) గారు కూడా ఉన్నారు.

కేవలం వీరు మాత్రమే కాకుండా డబ్బు కంటే కేవలం విలువలకు ప్రాధాన్యత ఇచ్చే సెలబ్రిటీలు ఇంకా చాలామంది ఉన్నారు.

టాలీవుడ్ తీరు పై రేవంత్ ఆగ్రహం ? ఏం చేయబోతున్నారు