ఓట్ల బండిల్ లో గందరగోళం జరిగింది.. సజ్జల

ఓట్ల బండింగ్ లో ఏదో గందరగోళం జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

టీచర్ల నుంచి వైసీపీకి ఆదరణ దక్కిందని తెలిపారు.ఈ క్రమంలో జరిగిన అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల వెల్లడించారు.

కమ్యూనిస్టుల ఓట్లు టీడీపీకి వెళ్లాయని పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని సజ్జల స్పష్టం చేశారు.

మొదటి సారి టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకున్నామన్నారు.జగన్ సంక్షేమ పథకాలను అందుకున్న వారు ఈ ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోలేదని తెలిపారు.

లెఫ్ట్ పార్టీలు వ్యవస్థీకృతంగా పని చేశాయన్న సజ్జల ఆ ప్రభావం కనిపించిందని వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ