Sajjala Ramakrishna Reddy : వైఎస్ సునీత వ్యాఖ్యల్లో వాస్తవం లేదు..: సజ్జల

దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి( YS Sunitha ) వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కౌంటర్ ఇచ్చారు.

సునీత వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పారు.టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే సునీత ఆరోపణలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.

సునీత వెనుక ఎవరు ఉన్నారో అందరికీ ఇప్పుడే అర్థమైందని తెలిపారు. """/" / వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది చంద్రబాబేనన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అప్పటి ప్రభుత్వం ఎందుకు దోషులను పట్టుకోలేదని ప్రశ్నించారు.ఓడిపోయే సీట్లనే చంద్రబాబు పవన్ కు ఇచ్చారన్న సజ్జల పవన్ కల్యాణ్ సీరియస్ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని విమర్శించారు.

ఈ క్రమంలోనే పవన్( Pawan Kalyan ) ఎవరి కోసం పని చేస్తున్నారని ప్రశ్నించారు.

అమ్మ సూచనలతో ప్రైవేట్ జెట్ లో షిరిడీకి వెళ్లిన హీరో విజయ్.. ఏం జరిగిందంటే?