జేబులో డబ్బులు లేవు ... సంచిలో కుమార్తె మృతదేహం ! అలా నడుచుకుంటూ...

తిత్లీ తుఫాన్ ప్రభావం తో ఏపీలోని శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి.

ప్రస్తుతానికి ఆ ప్రాంతాలకు సహాయ కార్యక్రమాలు అందుతున్నా.నష్టం మాత్రం తీర్చలేనంతగా ఉంది.

ప్రస్తుతం ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన అందరిని కలిచివేస్తోంది.ముకుంద్ దొర అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహంతో 8 కిలీమీటర్లు నడచి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తిత్లీ తుఫాన్ సమయం నుంచి ముకుంద్ దొర కుమార్తె బబిత కనిపించకుండా పోయింది.

తుఫాన్ సమయం వీచిన భీకర గాలులకు కొండచరియలు విరిగిపడడంతో బబిత మృతి చెందిందని నిన్న మొన్న అధికారులు ప్రకటించారు.

ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేసిన అధికారులు.మృతదేహం ఎక్కడుందో చెప్పారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రభుత్వ పరిహారం అందాలంటే పోస్టుమార్టం తప్పనిసరి అని.

అందుకే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు.తుఫాన్ దాటికి సర్వస్వం కోల్పోయిన ముకుంద్.

వాహనం సమకూర్చుకోవడానికి డబ్బుల్లేక తన భుజాన కుమార్తె మృతదేహాన్ని ఓ సంచిలో మోసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు.

మీడియా ద్వారా సమాచారం అందుకున్న అధికారులు.అప్పటికప్పుడు వాహనం సమకూర్చారు.

దళితులపై నారా భువనేశ్వరి అసభ్య పదజాలం.. ఫేక్ కాదని నిర్ధారణ..!!