తెలుగు వారికి తీరని లోటు..: కేటీఆర్

విలువలతో కూడిన జర్నలిజానికి రామోజీరావు( Ramoji Rao ) చిహ్నంగా నిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.

తెలుగు పత్రికారంగంతో పాటు ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వచ్చారని తెలిపారు.

తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం తపన పడేవారని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ క్రమంలో ఆయన కన్నుమూయడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తీరని లోటని తెలిపారు.

దేశం, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు.ఆయన స్వయంకృషితో కష్టపడి ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. జయం రవి భార్య కామెంట్స్ వైరల్!