తెలంగాణ బీజేపీలో విభేదాలు లేవు.. తరుణ్ చుగ్

తెలంగాణ బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులను ప్రకటించామని తెలిపారు.

అధ్యక్షుడి మార్పు ఎక్కడిదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.అందరం పార్టీ కోసం కలిసికట్టుగా పని చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

కొందరు కావాలనే కుట్ర పూరితంగా బీజేపీలో విభేదాలు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

చైనా: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. డ్రోన్ ఉపయోగించి తెలివిగా పట్టుకున్న భర్త..!