పిడుగుపాటు నుంచి తృటిలో తప్పించుకున్న యువతి.. షాకింగ్ వీడియో వైరల్..!

సాధారణంగా వర్షాలు వచ్చేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటాయి.ఇదే సమయంలో పిడుగులు కూడా పడతాయి.

ఇప్పటివరకు పిడుగు పాటు గురైన ఎంతో మంది చనిపోయారు.ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు.

అయితే తాజాగా ఒక యువతి ఒక పిడుగు పాటు నుంచి తృటిలో తప్పించుకుంది.

ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో బాగా వర్షం కురవడం చూడొచ్చు.తర్వాత ఈ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడానికి బాల్కనీలోకి వచ్చింది ఒక యువతి.

ఆపై ఈ చినుకులను తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేయడం మొదలెట్టింది.ఆ సమయంలో ఉరుములు ఉరుముతుంటే, మెరుపులు మెరుస్తున్నాయి.

ఇంతలోనే ఒక పిడుగు ఆ యువతి నిలుచున్న బాల్కనీపై ఒక్క ఉదుటున పడింది.

దీంతో భారీ ఎత్తున నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. """/" / అయితే ఒక్కసారిగా భారీ పిడుగు తనకు రెండు అడుగుల దూరంలోనే పడటంతో యువతి ఖంగు తిన్నది.

తృటిలో తప్పించుకున్న ఆ యువతి అక్కడి నుంచి పరుగులు తీసింది.ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ వీడియోని వైరల్ హాగ్ అనే ఓ ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.అదే నేను ఆ ప్లేస్‌లో ఉన్నట్లయితే నా గుండె ఆగిపోయేది అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

ఈ వీడియోకి ఇప్పటికే 24 వేల వ్యూస్ వచ్చాయి.మీరు కూడా ఈ షాకింగ్ వీడియో ని తిలకించండి.

ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న సాయిపల్లవి.. ఇకపై డాక్టర్ సాయిపల్లవి అంటూ?