బైక్ సతాయిస్తోందని బైక్ ను పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
TeluguStop.com
కొత్తగా కొన్న బైక్ ( Bike )సతాయిస్తోందని ఓ యువకుడు బైక్ ను పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది హిందూపురం మండలం ఎం బీరేపల్లి( Birepalli )కి చెందిన యువకుడు మనోజ్ హిందూపురం పట్టణంలో టీవీఎస్ షోరూం( TVS Showroom )లో ఐదు నెలల క్రితం ఒక ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు.
అయితే ఆ ద్విచక్ర వాహనానికి ఇటీవల కాలంలో మరమతులు ఎక్కువగా వస్తుండటంతో తన ద్విచక్ర వాహనాన్ని మార్చి ఇవ్వాలని కోరాడు.
అందుకు షో రూమ్ డీలర్ ఒప్పుకోకపోయేసరికి గొడవపడి షోరూమ్ ముందు తన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
ద్విచక్ర వాహనం దగ్ధమవుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు గుమికూడి ఏం జరిగిందో తెలియక వీక్షించారు.
షోరూం డీలర్ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
BetWinner Reseña Y Reputación Del Sitio (MX): Análisis Estructurado Para Principiantes