బూర్జు ఖలీఫాపైకి ఎక్కిన మహిళ.. ఎందుకోసమో తెలిస్తే షాక్..!
TeluguStop.com
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం ఏదైనా ఉందా అంటే కేవలం బూర్జ్ ఖలీఫా మాత్రమే.
దుబాయ్లో ఉండే దీన్ని చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది వెళ్తుంటారు.ఎందుకంటే ఇప్పటి వరకు దీన్ని మించిన భవనం ఎవరూ కట్టలేకపోయారు.
ఇక ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపెనీల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఇప్పుడు ఓ భారీ ప్రకటనను డిజైన్ చేసింది.
అయితే ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన యాడ్ ని డిజైన్ చేసి ఆశ్చర్యపరిచింది.
ఇందుకోసం ఎంతో కష్టపడి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో యాడ్ ను రూపొందించింది., దుబాయ్ లోనే చాలా ఎత్తయిన బూర్జ్ ఖలీఫా మీద ఓ మహిళను నిల్చోబెట్టి తమ కంపెనీకి సంబంధించిన యాడ్ ప్రమోషన్ చయేయించింది ఎయిర్ లైన్స్ సంస్థ.
బూర్జ్ ఖలీఫాపై నిలబడ్డ ఆ మహిళ కంపెనీకి సంబంధించిన పాంప్లెంట్ను పట్టుకుని ప్రమోట్ చేస్తున్నట్టు మనకు వీడియోలో కనిపిస్తోంది.
ఇక ఈ వీడియో 30 సెకండ్ల పాటు ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే ఈ యాడ్ లో కనిపిస్తున్న అమ్మాయి ప్రొఫెషనల్ స్కై డైవింగ్ చేసే ఇన్ స్పెక్టర్ అయిన నికోల్ స్మిత్ లుడ్ విక్ అని స్పష్టంగా అర్థమవుతోంది.
"""/"/ ఎందుకంటే ఆమె అయితేనే ఇందులో ఇంత డేర్గా చేస్తుందని సంస్థ భావించి ఆమెను అలాట్ చేసింది.
ఇక ఈమె కూడా సంస్థకు సంబంధించిన క్రూ మెంబర్ గా అదే యూనిఫామ్ వేసుకుని మరీ ప్రమోట్ చేయడం గమనార్హం.
మొత్తానికి ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.దీన్ని చూసిన చాలామంది ఆమెను శభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆమె చేసిన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.ఇలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ అవసరమంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియో కాస్త వైరల్గా మారిపోయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్ కోసం ఏఆర్ రెహమాన్?