తెలంగాణలో భూముల విలువ పెరిగింది.. కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందని తెలిపారు.

మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వమే దానికి కారణమని పేర్కొన్నారు.తెలంగాణలో భూముల విలువ పెరిగిందని మాజీ సీఎం చంద్రబాబు చెప్పారని వెల్లడించారు.

తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మి ఏపీలో యాభై ఎకరాలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారన్నారు.

మరోసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

గతంలో తెలంగాణ ఏర్పడకూడదని చెప్పిన వ్యక్తులే ఇప్పుడు రాష్ట్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నారని తెలిపారు.

రూపాయి ఖర్చు లేకుండా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!