కోరుట్లపేట ఎల్లమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడిన దుండగులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిన్న అర్థ రాత్రి చోరీకి పాల్పడిన దుండగులు.

ప్రొద్దున గౌడ సంఘం సభ్యులు ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద వచ్చి చూడగా రేణుక ఎల్లమ్మ పుస్తె మెట్టలు,బంగారు బొట్టు బిల్లలు, వెండి కండ్లు, వెండి దీపాలు, చెమ్మలు,ఎల్లమ్మ తల్లి పావనం ను దొంగిలించినట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్ కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని పరిశీలించి క్లూస్ టీం ఆధారంగా ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరిగింది.

ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చోరీకి పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకోవాలని పోలీస్ వారికి విజ్ఞప్తి చేశారు.

బన్నీని ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!