రేపు ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ బృందం..!

ఏపీలోని టీడీపీ నేతల బృందం రేపు ఢిల్లీకి పయనం కానున్నారు.ఈ మేరకు హస్తినకు వెళ్లనున్న టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి టీడీపీ ఫిర్యాదు చేయనుంది.

కాగా ఓటర్ల జాబితాలో అధికార వైసీపీ పార్టీ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతిపరుల దొంగ ఓట్లను చేర్చడంతో పాటు టీడీపీ అనుకూల ఓట్లను తొలగిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.

దీనిపై ఇప్పటికే ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ట్రాఫిక్ బ్లాక్ చేసిన స్కూటర్ డ్రైవర్.. జవాన్ కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగింది..?