టీచర్ మందలించిందని హాస్టల్ పై నుంచి దూకేసిన విద్యార్థిని..!!

తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలలో విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి.చిన్న చిన్న విషయాలకు విద్యార్థులు మనస్థాపానికి చెంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

కొంతమంది ఒత్తిడి తట్టుకోలేక మరి కొంతమంది.వివిధ కారణాల చేత విద్యాసంస్థల లోనే మరణిస్తూ ఉన్నారు.

పరీక్షాల ఫలితాలు విడుదలైన తర్వాత ఫెయిల్ అయిన చాలామంది విద్యార్థులు( Students ) సైతం ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఇటీవల తెలుగు రాష్ట్రాలలో ఎక్కువైపోయాయి.

మరి ముఖ్యంగా ఇటువంటి ఘటనాలతో తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

"""/" / పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఇదే తరహాలో సంగారెడ్డి జిల్లా రాయికోడ్( Sangareddy District Raikod ) లోని కేజీబీవీలో పదవ తరగతి చదువుతున్న స్నేహలత అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

టీచర్ మందలించిందని మనస్థాపానికి గురైన స్నేహాలత హాస్టల్ భవనం పైనుంచి దూకేసింది.ఇది గమనించిన కేజీబీవీ సిబ్బంది స్నేహలతను వెంటనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదే సమయంలో విషయాన్ని పాఠశాల సిబ్బంది స్నేహాలత తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించడం జరిగింది.

ఆడోళ్లు చూడకపోయినా సెన్సేషనల్ హిట్టైన కృష్ణ మూవీ.. ఏదంటే..?